చేతికొచ్చిన కొడుకును.. చివరకు భర్తను పోగొట్టుకుని విషాదంలో మునిపోయిన తెలుగుచలనచిత్ర సీనియర్ నటి కవిత, ఆమె కుమార్తెలను మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ సభ్యులు ఆదివారం పరామర్శించారు. గత నెలలో కేవలం 15 రోజుల వ్యవధిలో కరోనా సోకి కొడుకు స్వరూప్.. ఆ దుఃఖంలో నుండి కోలుకోక ముందే నాలుగు రోజుల క్రితం ఆమె భర్త, ప్రముఖ వ్యాపారవేత్త దశరథ్ రాజ్ కన్నుమూయడం అందర్నీ కలచివేసింది. వివాదాలకు అతీతంగా మెలిగే సీనియర్ నటి కుటుంబంలో ఇది జరగడంపై సహచర నటీనటులు ఫోన్లలో అందరూ పరామర్శించి ఓదార్చారు. ఆదివారం సీనియర్ నటుడు, మా అధ్యక్షుడు నరేష్ తోపాటు నటి పవిత్ర, కరాటే కళ్యాణి తదితరులు కవిత ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులు, కుమార్తెలతో మాట్లాడారు. జరిగిన ఘటనలపై విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా అండగా నిలుస్తామని.. మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగా చూసుకుంటామని భరోసా ఇచ్చారు.
Movie artists association (MAA) President @ItsActorNaresh, along with other artists from TFI met and conveyed their condolences to actress #kavitha on the huge loss of her husband and son due to #Covid19. pic.twitter.com/SJ5MiSTyIW
— BARaju's Team (@baraju_SuperHit) July 3, 2021